: అభివృద్ధి పేరిట చంద్రబాబు పచ్చటి పొలాలను లాక్కుంటున్నారు: సీపీఎం రాఘవులు

అభివృద్ధి పేరుతో రైతుల నుంచి పచ్చటి పొలాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లాక్కుంటున్నారని సీపీఎం సెంట్రల్ పోలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు ఆరోపించారు. సోవియట్‌ రష్యా విప్లవం శతజయంతి సందర్భంగా విశాఖపట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సంస్కరణల పేరుతో, పారిశ్రామిక అభివృద్ధి పేరుతో ఢిల్లీని కాలుష్య మయం చేశారని, ప్రజలు కనీసం రోడ్ల మీద తిరిగే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తూ ప్రధాని మోదీ కూడా ఏమీ చేయలేకపోతున్నారని ఆయన అన్నారు. అభివృద్ధి కోసం సరైన ప్రణాళికలు అమలు చేయాలని ఆయన సూచించారు. కార్పొరేట్ల కోసం అభివృద్ధి ప్రణాళికలు రచించడం సరైన విధానం కాదని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మోదీ భజన మాని, ప్రజల కోసం పనిచేయాలని ఆయన సూచించారు.

More Telugu News