: ఢిల్లీ జేఎన్ యూనివర్శిటీలో తుపాకీ కలకలం

ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్ లాల్ నెహ్రూ యూనిర్శిటీలో తుపాకీ కలకలం రేపింది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో, ఓ బ్యాగును గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది ఆ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. అనంతరం నలుపు రంగులో ఉన్న బ్యాగును స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో 7.65 పిస్టల్, ఏడు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెస్సీ విద్యార్థి నజీబ్ అహ్మద్ అదృశ్యంపై క్యాంపస్ లో ఆందోళనలు జరుగుతున్న సమయంలో ఇది చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. క్యాంపస్ లోకి ఈ బ్యాగ్ ఎలా వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు. అక్టోబర్ 15 నుంచి నజీబ్ అహ్మద్ కనిపించకుండా పోయాడు. దీంతో, జేఎన్ యూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. మరోవైపు, నజీబ్ అదృశ్యంపై విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని ఢిల్లీ పోలీసులను రాష్ట్రపతి ఆదేశించారు.

More Telugu News