: పాక్ తో యుద్ధానికి సిద్ధం కావాలి: సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ తో యుద్ధానికి సిద్ధంగా ఉండాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రభుత్వాన్ని అక్కడి సైన్యం ఎప్పుడైనా కూల్చివేసి, పాలనను తమ అధీనంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. సరిహద్దులో నిరంతరం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ, కాల్పులు జరుపుతూ, కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని... వీటిని మనం యుద్ధ సంకేతాలుగా భావించవచ్చని తెలిపారు. మరోవైపు, ఉరీ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ 100 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

More Telugu News