: బ్రిటన్ కు వెళ్లడం మరింత ఈజీ... భారతీయులకు బ్రిటన్ ప్రధాని హామీ

భారతీయులు మరింత సులువుగా బ్రిటన్ కు ప్రయాణించేలా నిబంధనలను సరళతరం చేస్తానని, వీసాలను సులువుగా ఇప్పించేలా నిర్ణయాలు తీసుకుంటానని బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే హామీ ఇచ్చారు. తన భారత పర్యటనలో భాగంగా మోదీతో కలసి ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్న ఆమె, ఇండియా నుంచి లండన్ వచ్చిపోయే వ్యాపారుల సౌకర్యార్థం 'రిజిస్టర్డ్ ట్రావెలర్ స్కీమ్'ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. స్వేచ్ఛా వాణిజ్యానికి బ్రిటన్ అత్యుత్తమ స్థాయిలో అవకాశాలను కల్పించాలన్నదే తన అభిమతమని థెరిస్సా మే ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇండియాకు బ్రిటన్ ఎంతో ముఖ్యమైన స్నేహదేశమని వ్యాఖ్యానించిన మోదీ, ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక ఒప్పందాల్లో 'మేకిన్ ఇండియా'ను భాగం చేస్తామని తెలిపారు.

More Telugu News