: ప్రొఫెసర్ లక్ష్మిని వదిలిపెట్టేది లేదు: ప్రత్తిపాటి పుల్లారావు

గుంటూరులో గైనకాలజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులే కారణమని తాము నమ్ముతున్నామని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఆమెను వదిలిపెట్టేది లేదని, అరెస్ట్ చేసి తీరుతామని అన్నారు. ఆమెను అరెస్ట్ చేయకుండా తాత్సారం చేస్తున్నారని వస్తున్న ఆరోపణలను ఖండించారు. లక్ష్మి, ఆమె భర్త పారిపోయారని, వారి సెల్ ఫోన్లు స్విచ్చాఫ్ చేసుండటంతోనే పోలీసులు ట్రేస్ చేయలేకపోతున్నారని చెప్పిన ప్రత్తిపాటి సాధ్యమైనంత త్వరలోనే లక్ష్మిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న ఆమె ఏ విమానాలు ఎక్కుకుండా లుకౌట్ నోటీసులను గుంటూరు పోలీసులు జారీ చేసినట్టు ప్రత్తిపాటి వెల్లడించారు. అమె ఎక్కడున్నా వెంటనే పోలీసులకు లొంగిపోవాలని, లేకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వుంటుందని హెచ్చరించారు.

More Telugu News