: 'జై ఆంధ్రప్రదేశ్'కు తరలిన వైఎస్ జగన్

నేటి మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శినీ స్టేడియంలో వైకాపా నిర్వహించతలపెట్టిన 'జై ఆంధ్రప్రదేశ్' బహిరంగ సభకు భారీఎత్తున జనం తరలుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడమే లక్ష్యంగా ఈ సభను నిర్వహిస్తుండగా, ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి వైకాపా అభిమానులతో పాటు విశాఖపట్నంలోని విద్యార్థినీ విద్యార్థులను వైకాపా స్టేడియానికి తరలిస్తోంది. ఈ సభలో పాల్గొనేందుకు ఇప్పటికే వైజాగ్ చేరుకున్న వైఎస్ జగన్, మరికాసేపట్లో ర్యాలీగా స్టేడియంకు బయలుదేరనున్నారు. జగన్ తో పాటు పార్టీ ఉత్తరాంధ్ర నేతలు బొత్స సత్యనారాయణ తదితరులు ఈ సభలో పాల్గొంటారని సమాచారం.

More Telugu News