: జగన్ క్రిస్టియన్ కాదు.. పిండప్రదానాలు, పూజలకు నిజమైన క్రిస్టియన్లు దూరం: సెబాస్టియన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిజమైన క్రిస్టియన్ కాదని టీడీపీ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ హ్యరీ సెబాస్టియన్ ఆరోపించారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో మాట్లాడిన ఆయన.. పుష్కరాల్లో పిండప్రదానాలు చేయడం, పూజలు నిర్వహించడం వంటివి చేసేవారు నిజమైన క్రిస్టియన్లు ఎలా అవుతారని ప్రశ్నించారు. అలా చేసేవారు నిజమైన క్రిస్టియన్లు కారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాలు జగన్ వెంట ఉన్నాయనడం పూర్తిగా అవాస్తవమన్నారు. క్రైస్తవుల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. అమరావతిలో క్రైస్తవ భవన నిర్మాణానికి ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు కేటాయించిందని సెబాస్టియన్ వివరించారు.

More Telugu News