: ఒకే కార్యక్రమంలో సచిన్, అమితాబ్, నాగార్జున, మమ్ముట్టి

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, బిగ్ బీ అమితాబ్, టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, కోలీవుడ్ నటుడు ప్రభు తదితరులు ఒక కార్యక్రమానికి హాజరై అలరించారు. ఈ సందర్భంగా వీరంతా కలసి దిగిన ఫొటోను అమితాబ్ తన ట్విట్టర్ అకౌంట్ లో అప్ లోడ్ చేశారు. అంతేకాదు, దిగ్గజాలతో కలవడాన్ని గౌరవంగా భావిస్తున్నానని ట్వీట్ చేశాడు. కల్యాణ్ జువెలర్స్ ప్రచారానికి సంబంధించిన ఓ కార్యక్రమం సందర్భంగా వీరంతా కలిశారు.

More Telugu News