: గవర్నర్ ను కలిసిన చంద్రబాబు... కాసేపట్లో కలవనున్న కేసీఆర్

ఇరు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాజ్ భవన్ కు వెళ్లి, గవర్నర్ కు శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. ఈ సందర్భంగా, ఇరు ముఖ్యమంత్రులతో వేర్వేరుగా నరసింహన్ చర్చలు జరపనున్నారు. సచివాలయ భవనాల అప్పగింతపై ఇద్దరు సీఎంలతో చర్చించనున్నారు.

More Telugu News