: 5న కర్నూల్ లో పర్యటించనున్న చంద్రబాబు

ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూల్ లో పర్యటించనున్నారు. టీడీపీ నిర్వహిస్తున్న జనచైతన్య యాత్రల్లో భాగంగానే చంద్రబాబు ఈ పర్యటన చేస్తారు. ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న కర్నూల్ పాతబస్తీలో సుమారు మూడు కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా, 5వ తేదీ ఉదయం పది గంటలకు సీఎం కర్నూల్ చేరుకుంటారని, మధ్యాహ్నం 1.30 గంటల వరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు చెప్పారు. ఆ తర్వాత 2.30 గంటల వరకు స్టేట్ గెస్ట్ హౌస్ లో భోజనం చేసి కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటారని, ఆ తర్వాత డ్వాక్రా మహిళలు, రైతులతో నిర్వహించే బహిరంగ సభకు చంద్రబాబు హాజరవుతారని చెప్పారు.

More Telugu News