: నారా లోకేశ్ కోట్ల రూపాయల కమీషన్ కొట్టేయబోతున్నాడు: అంబటి రాంబాబు

టీడీపీ నేత నారా లోకేశ్ కోట్ల రూపాయల కమీషన్ కొట్టేయబోతున్నాడంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విశాఖ తీరంలో నిర్వహించనున్న ‘బీచ్ ఫెస్టివల్’ను ముంబైకి చెందిన ఒక కంపెనీకి అప్పగించడం ద్వారా లోకేశ్ కోట్ల రూపాయల కమీషన్ అందుకోనున్నాడంటూ ఆరోపించారు. గుంటూరులో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘బీచ్ ఫెస్టివల్’ అనేది విదేశీ సంస్కృతి అని, ఈ ఫెస్టివల్ పై బీజేపీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని అన్నారు. గతంలో ప్రేమజంటలు పార్కుల్లో, బహిరంగ ప్రదేశాల్లో కూర్చుంటే నానా రభస చేసి, వారిపై దాడులు చేసిన చరిత్ర బీజేపీదని విమర్శించారు. మరి, అలాంటప్పుడు ‘బీచ్ ఫెస్టివల్’ ను ఏ విధంగా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఈ ఫెస్టివల్ లో తొమ్మిది వేల జంటలతో డ్యాన్స్ లు చేయిస్తామని చెబుతున్నారని, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆ జంటలకు తాళిబొట్లు ఇచ్చి కట్టిస్తారా? అని అంబటి ప్రశ్నించారు.

More Telugu News