: గుంటూరులో కోట్లాది రూపాయల చైనా కల్తీ కారం స్వాధీనం

మిర్చికి పేరుగాంచిన‌ గుంటూరులో కల్తీ కారం త‌యారు చేస్తోన్న వారి గుట్టుర‌ట్టైంది. కారం మిల్లుల‌పై విజిలెన్స్ అధికారులు జ‌రుపుతున్న దాడుల‌లో భాగంగా ఈ రోజు ఉద‌య్‌కోల్డేజ్ స్టోరేజ్‌లో త‌నిఖీలు చేసిన అధికారులు అందులో ఉన్న‌ కోట్లాది రూపాయల క‌ల్తీకారాన్ని సీజ్ చేశారు. చైనా నుంచి దిగుమ‌తి అయిన మొత్తం 4,200 బ‌స్తాల కారాన్ని స్వాధీనం చేసుకున్న‌ట్లు, ఇందుకు సంబంధించిన వారిపై కేసులు న‌మోదు చేసిన‌ట్లు అధికారులు తెలిపారు. న‌కిలీ కారం త‌యారీ కోసం రంగులు వాడినట్లు స‌మాచారం.

More Telugu News