: ఇంగ్లండ్ కు ఘోర పరాభవం తప్పదు: గంగూలీ

టీమిండియా ప్రస్తుత ఫామ్ పై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. భారత ఆటగాళ్ల ఫామ్ చూస్తుంటే ఐదు టెస్టుల సిరీస్ లో ఇంగ్లండ్ క్లీన్ స్వీప్ కు గురవుతుందేమో అనిపిస్తోందని జోస్యం చెప్పాడు. ఈ టూర్ లో ఇంగ్లండ్ కు ఘోర పరాభవం తప్పదని అన్నాడు. న్యూజిలాండ్ మాదిరే ఇంగ్లండ్ ను కూడా వైట్ వాష్ చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. మరోవైపు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మాట్లాడుతూ, భారత జట్టులో అశ్విన్, జడేజాలాంటి స్పిన్నర్లు ఉన్నారన్న విషయం గురించి ఆలోచించకూడదని... సహజ సిద్ధంగా ఆడాలని తమ ఆటగాళ్లకు సూచించాడు. ఇంగ్లండ్ జట్టులో కూడా టాప్ స్పిన్నర్లు ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపాడు. బంగ్లాదేశ్ తో చివరి టెస్టులో ఓటమిపాలైన విషయాన్ని మనసులోంచి తీసివేయాలని చెప్పాడు.

More Telugu News