: సముద్రతీరంలో డిస్కో డ్యాన్సులు నిర్వహించాలనుకోవడం సిగ్గుచేటు: భూమన

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు విదేశీ సంస్కృతిపై మోజు ఎక్కువైందని ఆయన ఆరోపించారు. ప్రేమికుల దినోత్సవం రోజు విశాఖ సముద్రతీరంలో డిస్కో డ్యాన్సులు నిర్వహించాలని యోచిస్తున్నారని విమర్శించారు. తెలుగువారి మనసంతా ప్రేమతోనే నిండి ఉంటుందని... ప్రత్యేకంగా ప్రేమికుల దినోత్సవం పేరుతో కార్యక్రమాలు అవసరం లేదని మండిపడ్డారు. ప్రచారం కోసమే చంద్రబాబు ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి కార్యక్రమాలను చేపడితే ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

More Telugu News