: పెట్రో ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవడంపై కేంద్రం దృష్టి

మనం అత్యధికంగా దిగుమతి చేసుకునే వాటిలో పెట్రోలియం ఉత్పత్తులది సింహభాగం. దీనికోసం మనం ఎంతో ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో, ముడిచమురు, గ్యాస్ దిగుమతులను తగ్గించుకోవడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో, దిగుమతులను తగ్గించుకోవడానికి ఉన్న మార్గాలను అన్వేషించడానికై నిన్న ప్రధాని మోదీ నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధానితో పాటు హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్, నీతి అయోగ్ ఛైర్మన్, సీఈవోలతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్యాన్ని ఎలా సాధించాలో పెట్రోలియం మంత్రిత్వ శాఖ వివరించింది. దేశీయంగా గ్యాస్, ముడిచమురు ఉత్పత్తిని పెంచడం, జీవ, పునరుత్పాదక ఇంధనాలను ప్రోత్సహించడం, అందుబాటులో ఉన్న ఇంధనాన్ని సమర్థవంతంగా, పొదుపుగా వినియోగించడం తదితర మార్గాల ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చని సూచించింది.

More Telugu News