: కేసీఆర్‌పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్ర‌శంస‌ల జల్లు

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్ర‌శంస‌ల జల్లు కురిపించారు. ఈ రోజు హైద‌రాబాద్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ అభివృద్ధి సాధిస్తూ ముందుకు వెళుతోందని అన్నారు. ఆయ‌న కృషి వ‌ల్లే తెలంగాణ 'ఈజ్ ఆఫ్ డూయింగ్‌'లో ఫస్ట్ ర్యాంకు సాధించిందని చెబుతూ, ఓవైసీ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. తెలంగాణ ఏర్ప‌డిన రెండున్న‌రేళ్ల‌లోనే అభివృద్ధి సాధిస్తూ కేసీఆర్ తనదైన ముద్ర వేయగలిగారని అన్నారు. తెలంగాణ పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షిస్తూ దూసుకుపోతోంద‌ని కొనియాడారు.

More Telugu News