: సిమి ఉగ్రవాదులను హతమార్చినందుకు మమ్మల్ని ప్రశంసించాలి: మధ్యప్రదేశ్ జైళ్ల శాఖ మంత్రి

సిమి ఉగ్రవాదులను హతమార్చినందుకుగాను తమను ప్రశంసించాలని మధ్యప్రదేశ్ జైళ్ల శాఖ మంత్రి కుసుమ్ మెహ్ దెలే అన్నారు. ఉగ్రవాదుల ఎన్ కౌంటర్ విషయమై మధ్యప్రదేశ్ సీఎం శివ్ రాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం, పోలీసులపై విమర్శల నేపథ్యంలోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులను హతమార్చడం ద్వారా మరిన్ని ప్రమాదకరమైన పనులు వారు చేయకుండా తాము ఈ విధంగా అడ్డుకున్నామని అన్నారు. ఈ ఎన్ కౌంటర్ చేసినందుకు పోలీసులను, ప్రభుత్వాన్ని ప్రశంసించాలని ఆమె చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా భోపాల్ సెంట్రల్ జైలులో కొన్ని సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదన్న విషయాన్ని ఆమె అంగీకరించారు. అయితే, అంతపెద్దగా ఉన్న జైలు ప్రహరీని ఉగ్రవాదులు ఎలా ఎక్కారనే విషయమై తెలియాల్సి ఉందన్నారు.

More Telugu News