: న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు
న్యాయస్థానాల్లో న్యాయమూర్తులతో పాటు సిబ్బంది కొరత ఉందంటూ ఆవేదన వ్యక్తమవుతుండడంతో కేంద్రం ఆయా పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తోంది. హైకోర్టుల్లో జడ్జిల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గువాహటి, ఢిల్లీ హైకోర్టుల్లో నియమించేందుకు 10 మంది న్యాయమూర్తుల పేర్లను కేంద్రం ఖరారు చేసింది. అలహాబాద్ హైకోర్టులో 35 మంది జడ్జిల నియామకం జరగనుందని తెలుస్తోంది. గుజరాత్ హైకోర్టులో జడ్జిల నియామకం కోసం జ్యుడిషియల్ సర్వీసెస్ నుంచి ఎంపిక జరగనున్నట్లు సమాచారం. అలాగే గువాహటి హైకోర్టులో నియమితులయ్యే న్యాయమూర్తులను బార్ అసోసియేషన్, జ్యుడిషియల్ కమిషన్ నుంచి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.