: అద్దె ఇంటి కోసం వెతుకుతుంటే, ఇల్లు చూపిస్తూ అఘాయిత్యం!

తన భర్తతో కలసి అద్దె ఇంటిని వెతుక్కుంటూ వెళ్లిన ఓ యువతిపై ఏడుగురు అత్యాచారం చేసిన ఘటన ముంబైలో కలకలం రేపింది. పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, అంబోలీ ప్రాంతంలో అద్దె ఇంటిని వెతుకుతున్న సమయంలో, ఖాళీగా ఉన్న ఓ ఇంటిని చూసేందుకు ఆమె లోపలకు వెళ్లింది. ఆ సమయంలో ఇల్లు చూపించేందుకు లోపలికి వచ్చిన వారిలో ముగ్గురు ఆమె భర్తను బయటే నిర్బంధించగా, నలుగురు ఆమెపై అదే ఇంట్లో అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

More Telugu News