: 10 రోజుల వరకు సచివాలయాన్ని కూల్చొద్దు: టీఎస్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

పది రోజుల వరకు సచివాలయాన్ని కూల్చే పనులు చేపట్టరాదంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. కూల్చివేతపై సమగ్ర నివేదికను సమర్పించాలని... 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సచివాలయాన్ని కూల్చొద్దంటూ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్ రెడ్డిలు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను ఈ రోజు హైకోర్టు విచారించింది. తదుపరి విచారణను పది రోజుల పాటు వాయిదా వేసింది. వాస్తు బాగాలేదంటూ సచివాలయాన్ని కూల్చివేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

More Telugu News