: దారి తప్పిన అరుదైన భారీ స్వర్ణనాగు!

ఓ అరుదైన భారీ స్వర్ణనాగు దారితప్పి జనావాసాల్లోకి వచ్చింది. ఎటు పోవాలో తెలీక ఓ ఇంట్లోని నీటి తొట్టిలో పడి ప్రాణాలు కాపాడుకునేందుకు తంటాలు పడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా కేవీబీ పురం, న్యూ కాలనీలో జరిగింది. ఈ స్వర్ణనాగుపామును చూసిన మునెమ్మ అనే మహిళ, అటవీ అధికారులకు సమాచారం ఇచ్చింది. లేత బంగారు రంగులో నీటిపై పడగవిప్పి ఆడుతున్న ఈ నాగుపామును చూసేందుకు ప్రజలు పెద్దఎత్తున ఆసక్తి చూపారు. అటవీ శాఖ అధికారులు వచ్చి పామును జాగ్రత్తగా బయటకు తీసి సమీపంలోని అడవిలో వదిలిపెట్టారు. ఆ పాము ఇదే!

More Telugu News