: సౌదీ వైమానిక దాడిలో 60 మంది మృతి

యెమెన్ పై సౌదీ దాడులు తీవ్రతరమయ్యాయి. యెమెన్ లోని అల్-హోదీదాలోని ఓ జైలుపై సౌదీ జరిపిన వైమానిక దాడుల్లో ఏకంగా 60 మంది దుర్మరణం చెందారు. వీరిలో ఖైదీలతో పాటు, జైలు సిబ్బంది కూడా ఉన్నారు. అంతేకాకుండా, మరో 38 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. శనివారం అర్ధరాత్రి సౌదీ అరేబియా ఈ దాడులు జరిపింది. ఆదివారం నాడు కూడా హోదీదా గగనతలంపై సౌదీ జెట్ ఫైటర్లు ఎగురుతూనే ఉన్నాయి. దీంతో, తీవ్ర భయాందోళనలకు గురైన స్థానికులు... తమ నివాసాలను వదిలి, బయటకు వచ్చేందుకే భయపడుతున్నారు.

More Telugu News