: మోదీని కలిసిన సీనియర్ నటి గౌతమి

దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించి అభిమానుల‌ను అల‌రించిన సీనియర్‌ నటి గౌతమి తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. ఈ అంశంపై ఆమె స్పందిస్తూ.. మోదీని కలుసుకోవడం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ప్రధాని తనను ఢిల్లీకి ఆహ్వానించి త‌న‌తో మాట్లాడార‌ని ఆమె చెప్పారు. మోదీకి ఉన్న విజన్, రోల్‌ తదితర అంశాలపై త‌న‌కు స్వ‌యంగా వివ‌రించార‌ని పేర్కొన్నారు. త‌మ స‌మావేశం అరగంట సేపు జ‌రిగింద‌ని చెప్పారు. కేన్సర్‌ వ్యాధి నుంచి బయట పడిన తాను ఒక స్వ‌చ్ఛంద సంస్థ‌ను నిర్వ‌హిస్తున్నాన‌ని, కేన్స‌ర్‌ వ్యాధిపై అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నాన‌ని గౌతమి పేర్కొన్నారు. కాగా వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న‌ యోగా దినోత్సవం నాటికి యోగా, ఆరోగ్యంపై ప్ర‌చారం క‌ల్పించ‌డానికి ప్ర‌ధాని సూచ‌న‌ల మేర‌కు ముందుకు వెళ్ల‌నున్న‌ట్లు తెలిపారు. రెండేళ్ల నుంచి భార‌త్‌లో పలు అవగాహనా కార్యక్రమాలు పెరిగాయ‌ని, అభివృద్ధి సాధిస్తూ భార‌త్ దూసుకెళుతోంద‌ని ఆమె అన్నారు.

More Telugu News