: ఎమ్మెల్యే రోజాపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు

ఏ రాజకీయ నేత అయినా ఒక మంచి పని చేస్తే, పార్టీలకు అతీతంగా ప్రజలు వారిని అభినందిస్తారనే దానికి ఇదే నిదర్శనం. తాజాగా, వైసీపీ ఎమ్మెల్యే రోజా మానవత్వంతో చేసిన ఓ పనిని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వివరాల్లోకి వెళ్తే, సింధు (25) అనే అమ్మాయి నిన్న తన స్కూటీపై చిత్తూరు నుంచి తిరుపతిలోని వెంకటేశ్వర యూనివర్శిటీకి బయలుదేరింది. మార్గమధ్యంలో నేండ్రగుంట వద్ద గుర్తు తెలియని వాహనం ఆమె స్కూటీని ఢీకొని, ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో తలకు బలమైన దెబ్బ తగలడంతో, రోడ్డు పక్కన స్పృహ తప్పి పడిపోయింది సింధు. అదే సమయంలో జిల్లా పరిషత్ సమావేశానికి హాజరుకావడానికి రోజా అదే మార్గంలో వెళుతున్నారు. ఈ సమయంలో సింధును గుర్తించిన ఆమె... తన వాహనంలో పూతలపట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సరైన సమయంలో తీసుకురావడంతో... సింధు ప్రాణాలతో బయటపడింది. ఈ నేపథ్యంలో, రోజా చేసిన ఈ మానవీయ సహాయం సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అనేక మంది నెటిజన్లు రోజా చేసిన మంచి పనిని మెచ్చుకుంటూ, ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

More Telugu News