: మావోయిస్టులను చంపడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నాడు: విరసం నేత వరవరరావు

ఏవోబీలో జరిగిన ఎన్ కౌంటర్ పై విరసం నేత వరవరరావు మండిపడ్డారు. ఒక న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, ‘మావోయిస్టులను అదుపులోకి తీసుకోవడానికి ‘గ్రేహౌండ్స్’ వెళ్లడం లేదు. ఆర్కే కోసం ప్రతి ఇంట్లో సోదాలు చేస్తున్నారు. నిరాధారంగా మేము ఆరోపణలు చేయడం లేదు. మావోయిస్టులు దొరకడం అంటే చచ్చిపోవడమే. చంపడమే అనే నీతిని ఈ రాజ్యం అనుసరిస్తోంది. ప్రభుత్వం చేతిలో ఉండే పనిముట్టుగానే పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఎన్ కౌంటర్లు వద్దు అని ప్రభుత్వాలు అనుకున్న రోజుల్లో ఎన్ కౌంటర్లు జరగలేదు. చెన్నారెడ్డి గారు ఒక తొమ్మిది నెలలు ఎన్ కౌంటర్లు వద్దనుకుంటే లేవు, రాజశేఖరెడ్డిగారు ఒక తొమ్మిది నెలలు ఎన్ కౌంటర్లు వద్దనుకుంటే లేవు, ఎన్టీ రామారావు గారు ఒక తొమ్మిది నెలలు ఎన్ కౌంటర్లు వద్దనుకుంటే లేవు. మావోయిస్టుల సమస్యను ఎల్లకాలం శాంతిభద్రతల సమస్యగా చంద్రబాబు నాయుడు చూస్తూ.. చంపడమే పనిగా పెట్టుకుంటున్నాడు కాబట్టి ఎన్ కౌంటర్లు ఉంటున్నాయి. చెన్నారెడ్డి, ఎన్టీఆర్, రాజశేఖరెడ్డిల మీద నాకేమీ ప్రేమ లేదు. ఆ ముగ్గురు ముఖ్యమంత్రులు చేసిన దారుణాలు కూడా చాలా ఉన్నాయి’ అంటూ వరవరరావు మండిపడ్డారు.

More Telugu News