: మెడికో సంధ్యారాణి ఆత్మహత్యకు కారణమైన ప్రొఫెసర్ లక్ష్మిని సస్పెండ్ చేసిన మంత్రి కామినేని

సోమవారం నాడు విషపు ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్న గుంటూరు మెడికల్ కాలేజీ గైనకాలజీ పీజీ విద్యార్థిని సంధ్యారాణి కేసు విషయంలో ప్రొఫెసర్ లక్ష్మిని సస్పెండ్ చేస్తూ ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. ప్రొఫెసర్ లక్ష్మి వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సంధ్యారాణి తన సూసైడ్ నోట్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ జరుగుతుందని, సంధ్యారాణి మృతికి కారణమైన వారిని చట్టం ముందు నిలుపుతామని కామినేని స్పష్టం చేశారు. సంధ్యారాణి కుటుంబాన్ని ఆదుకుంటామని, జూనియర్ డాక్టర్లు ఆందోళన విరమించి విధులకు, తరగతులకు హాజరు కావాలని ఆయన కోరారు. కాగా, ఓ గర్భిణికి చికిత్సల విషయంలో సంధ్య సరిగ్గా స్పందించని కారణంగా కడుపులోనే బిడ్డ మరణించిందని, ఈ కారణంతో ఆందోళన చెంది ఆమె ఆత్మహత్యకు పాల్పడి వుండవచ్చని ప్రొఫెసర్ లక్ష్మి వివరణ ఇచ్చారు. తన 23 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ ఏ విధ్యార్థినినీ వేధించలేదని అన్నారు.

More Telugu News