: నా ఇంట్లోనే ఇంకుడు గుంత లేదు.. ఈ కేసు నేనెలా విచారిస్తానన్న హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి

ఇంకుడు గుంతలకు సంబంధించి కోర్టులో దాఖలైన ఓ వ్యాజ్యంపై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఇంట్లోనే ఇంకుడు గుంత లేదని, అది ఏర్పాటు చేసుకున్నాకే ఈ వ్యాజ్యాన్ని విచారిస్తానని పేర్కొన్నారు. అంతేకాదు, తనదో చిన్ని ఇల్లు అని, ఇంకుడు గుంత ఎలా ఏర్పాటు చేసుకోవాలో కూడా తెలియదని, ఈ విషయంలో ఎవరిని సంప్రదించాలో చెప్పాలంటూ పిటిషనర్, జీహెహెచ్ఎంసీ తరపు న్యాయవాదులను కోరారు. నివాస గృహాల్లో శాశ్వత ప్రాతిపదికన ఇంకుడుగంతల ఏర్పాటు, నీటి పరిరక్షణ కార్యాచరణ ప్రణాళికపై మంగళవారం హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఏసీజే పై వ్యాఖ్యలు చేశారు.

More Telugu News