: ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. ఆసుపత్రికి తరలింపు

కడప జిల్లా ఇడుపులపాయలో ఈ రోజు ఓ ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను అనంతపురం జిల్లా ఎన్.పీ.కుంటకు చెందిన అమ్మాయిగా గుర్తించారు. ఉద‌యం నీళ్లలో విషం కలుపుకుని తాగి ఆమె ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డింది. అయితే కొద్ది సేపటికి తోటి విద్యార్థులు ఈ విష‌యాన్ని గమనించి, వెంట‌నే కళాశాల యాజమాన్యానికి తెలప‌డంతో విద్యార్థినిని 108 వాహనంలో కడప రిమ్స్‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. చదువులో అధికంగా ఒత్తిడికి గురికావ‌డం వ‌ల్లే విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆసుప‌త్రిలో ఆమె పరిస్థితి నిలకడగా ఉంది.

More Telugu News