: కాలిఫోర్నియాలో ట్రక్కును ఢీకొన్న టూరిస్ట్ బస్సు... 13 మంది మృతి.. 31 మందికి తీవ్ర‌గాయాలు

ట్రక్కును ఓ టూరిస్ట్‌ బస్సు ఢీకొట్టడంతో 13 మంది మృతి చెందిన ఘ‌ట‌న అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. ప్ర‌మాదంలో మ‌రో 31 మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. వారికి ఆసుప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు. అందులో ఐదుగురి పరిస్థితి విష‌మంగా ఉంది. కాసినో నుంచి తిరిగొస్తున్న టూరిస్ట్‌ బస్సు కాలిఫోర్నియాలోని పామ్‌ స్ప్రింగ్స్‌ వద్దకు రాగానే ఈ ఘటన జరిగింది. యూఎస్ఏ హాలీడేకు చెందిన టూరిస్ట్‌ బస్సుగా దీనిని గుర్తించారు. రెడ్ ఎర్త్‌ కాసినో నుంచి లాస్‌ ఏంజెల్స్‌ తిరిగి వెళుతుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్ర‌మాదం గురించి స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ‌కు చేరుకొని బస్సు అద్దాలు పగులగొట్టి సాయం అందించే ప్ర‌య‌త్నం చేశారు. మృతుల్లో అధిక శాతం బస్సు ముందు భాగంలో కూర్చున్న టూరిస్టులేన‌ని అధికారులు చెప్పారు.

More Telugu News