: గుంటూరు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం.. కోల్డ్ స్టోరేజీలో భారీగా ఎగసిపడుతున్న మంటలు

గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలోని లక్ష్మీలావణ్య కోల్డ్ స్టోరేజీలో ఈ తెల్లవారుజామున భారీ అగ్నప్రమాదం సంభవించింది. స్టోరేజీ నుంచి మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. వారికి స్థానికులు సాయం అందిస్తున్నారు. ప్రమాద సమయంలో లోపల ఉన్న 35 వేల మిర్చి టిక్కీలు మంటలకు ఆహుతి అయ్యాయి. ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా? లేక ఇంకేదైనా కారణమా? అన్న విషయంపై స్పష్టత లేదు. లోపల అంటుకున్న మంటలు పూర్తిగా చల్లారడానికి రెండు రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు.

More Telugu News