: అన్నగారితో గురుభావం.. చిరంజీవితో ఆత్మీయానుబంధం ఉన్నాయి!: పరుచూరి గోపాల కృష్ణ

‘అన్న ఎన్టీఆర్ గారితో గురుభావంతో ఉన్నాము. బాలకృష్ణ, మోహన్ బాబు గార్లతో సోదరభావంతో ఉన్నాము. చిరంజీవిగారితో ఆత్మీయానుబంధంతో ఉన్నాము’ అని ప్రముఖ సినీ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ,‘చిరంజీవికి జన్మనిచ్చిన తండ్రి, పిల్లను ఇచ్చిన మామ.. వాళ్లిద్దరూ లెఫ్టిస్ట్ లు. వాళ్లిద్దరి భావజాలం తెలియకుండానే ఆ ప్రభావం చిరంజీవిలో పడింది. 'ఖైదీ' సినిమా నుంచి ఇప్పటి వరకు చిరంజీవి గారు మాతో మాటలు రాయించుకుంటూనే ఉన్నారు. 2005 తర్వాత చాలామంది హీరోలు పరుచూరి బ్రదర్స్ తో మాటలు రాయించుకోలేదు. కానీ, చిరంజీవి గారు అలా కాదు. ‘ఖైదీ నంబరు 150’వ చిత్రానికి మాటలు రాసేందుకు లేటెస్ట్ గా ఉన్న మాటల రచయితలను పెట్టుకోవచ్చు... పరుచూరి బ్రదర్స్ నే మాటలు రాయమని ఆయన అడగక్కర్లేదు. కానీ, మా మీద ఉన్న నమ్మకం, ఆత్మీయతతోనే చిరంజీవి గారు మమ్మల్ని సెలెక్ట్ చేశారు’ అని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.

More Telugu News