: ప్రభాస్ జన్మదిన వేడుకల్లో విషాదం... అభిమాని మృతి

తన అభిమాన హీరో పుట్టిన రోజు వేడుకలను వైభవంగా జరుపుకోవాలని ఓ యువకుడు చేసిన ప్రయత్నం అతని కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. హీరో ప్రభాస్ పుట్టిన రోజు వేడుకల వేళ ప్రశాంత్ (19) అనే వీరాభిమాని కరెంట్ షాక్ తో మరణించిన ఘటన నిజామాబాద్ లో జరిగింది. వేడుకల సందర్భంగా ఓ ప్లెక్సీని కడుతున్న ప్రశాంత్, ప్రమాదవశాత్తూ పక్కనే ఉన్న విద్యుత్ వైర్లను తాకాడు. దీంతో షాక్ కొట్టి పైనుంచి కిందపడిన ప్రశాంత్, తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటన గురించిన సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని తరలించి, కేసు నమోదు చేసుకున్నారు.

More Telugu News