: సమస్య పరిష్కారమైందనుకున్న కరణ్ జొహార్ కు ఊహించని షాక్!

'యే దిల్ హై ముష్కిల్' సినిమా రిలీజ్ కు అడ్డంకులు తొలగిపోయాయని ఆనందంగా ఉన్న దర్శకనిర్మాత కరణ్ జొహార్ కు ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమా విడుదలకు ఎట్టి పరిస్థితుల్లోను సహకరించబోమని థియేటర్ యాజమానులు తేల్చి చెప్పారు. పాక్ నటులు నటించిన ఏ సినిమాను థియేటర్లలో ఆడనివ్వబోమని వారు స్పష్టం చేశారు. దీంతో, కరణ్ సినిమా కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. తన సినిమా విడుదలకు సహకరించాలంటూ కేంద్రమంత్రి రాజ్ నాథ్ ను ఢిల్లీలో కలిసి కరణ్ విన్నవించాడు. అనంతరం ఈ ఉదయం, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ సమక్షంలో ఎమ్మెన్నెస్ అధినేత రాజ్ థాకరేతో చర్చలు జరిపి, సినిమా విడుదలకు అడ్డంకులను తొలగించుకున్నాడు. ఇకపై పాక్ నటులకు తన సినిమాల్లో అవకాశం ఇవ్వనని, ఆర్మీ వెల్ఫేర్ ఫండ్ కు రూ. 5 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చాడు. దీంతో, రాజ్ థాకరే కూడా సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, థియేటర్ల యజమానుల తాజా నిర్ణయంతో, ఊహించని విధంగా సమస్య మళ్లీ మొదటికొచ్చింది.

More Telugu News