: ఇంట్లో కూర్చొని పిచ్చి రాతలు రాసుకున్నారు.. దానినే సర్వే అంటున్నారు: 'టీఆర్ఎస్'పై ఉత్తమ్కుమార్ విమర్శలు
టీఆర్ఎస్ పాలనపై సర్వే చేశామని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుందని పలువురు చెబుతున్నారని, అయితే ఆ సర్వే అంతా బోగస్ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రజా సమస్యలను పట్టించుకోని కేసీఆర్కి, ఆయన కుటుంబ సభ్యులకి ప్రజలు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో లక్షా ముప్పై ఐదు వేల బడ్జెట్ ఉంటే సగం సంవత్సరం అయిపోయిందని, అయినా రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంటు ఏదీ నెరవేరలేదని ఉత్తమ్కుమార్ విమర్శించారు. టీఆర్ఎస్ తీరు ఇలా ఉంటే, ఏం సర్వే చేశారో వారి పాలన బాగుందని చెబుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరో ఇంట్లో కూర్చొని పిచ్చి రాతలు రాసుకున్నారని, దాన్నే సర్వే అని చెబుతున్నారని ఉత్తమ్ విమర్శించారు.