: తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతం.. ఏపీ పోర్టుల్లో ప్రమాద హెచ్చరిక జారీ

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పోర్టుల్లో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ అయింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమైందని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వాయుగుండం పోర్టుబ్లెయిర్‌కు వాయవ్య దిశగా 350కి.మీ. దూరంలో ఉంద‌ని పేర్కొన్నారు. రాగ‌ల‌ 48 గంటల్లో బలపడి తుపానుగా మారే అవకాశం ఉంద‌ని చెప్పారు. మ‌రో 24 గంట‌ల్లో మయన్మార్‌ తీరానికి చేరుకుంటుంద‌ని పేర్కొన్నారు. దీంతో పోర్టుల్లో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

More Telugu News