: యూపీలోని నోయిడాలో దారుణం.. టోల్ ప్లాజాపై దాడి చేసి బీభత్సం సృష్టించిన యువకులు
ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో జరిగిన దారుణ ఘటన వెలుగులోకొచ్చింది. పలువురు గుర్తు తెలియని యువకులు ఓ టోల్ ప్లాజా వద్ద హల్చల్ చేశారు. అక్కడి ఉద్యోగులపై దాడికి దిగారు. ఆ మార్గం గుండా వెళుతోన్న యువకులను ఉద్యోగులు టోల్ గేట్ ట్యాక్స్ చెల్లించమన్నందుకే ఈ దాడికి దిగారు. తమ వాహనాన్ని అక్కడే ఉంచి, యువకులు టోల్ ప్లాజాలోకి దూసుకొచ్చారు. ఆ కార్యాలయం అద్దాలను పగులగొట్టారు. కంప్యూటర్లను కిందపడేశారు. యువకుల దాడి ఘటన అక్కడి సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.