: ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ముప్పు
అలహాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కాసేపటికే ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తిందని పైలట్లు గమనించారు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ సిబ్బందికి సమాచారం అందించారు. ఆ తర్వాత అలహాబాద్ లోని ఎయిర్ పోర్టులో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం క్షేమంగా ల్యాండ్ అవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమాన ప్రయాణాన్ని రద్దు చేసుకున్న ప్రయాణికులకు టికెట్ సొమ్మును రీఫండ్ చేశామని ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ మిశ్రా తెలిపారు. ప్రయాణానికి సిద్ధంగా ఉన్న వారి కోసం మరో విమానంలో సదుపాయాలు కల్పించినట్టు వెల్లడించారు.