: ప్రజలు సరైన సమయంలో కర్రు కాల్చి కేసీఆర్ కు వాతపెడతారు: రేవంత్ రెడ్డి

ప్రజలు సరైన సమయంలో కర్రు కాల్చి కేసీఆర్ కు వాతపెడతారంటూ తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తెలుగుదేశం పార్టీ అని, తమ పార్టీ ప్రజలకు వేదికగా ఉంటుందని అన్నారు. సంక్షేమం అంటే ఎన్టీఆర్, అభివృద్ధి అంటే చంద్రబాబు అని, ఈ రెండు కలబోసి ఉన్న ఈ పార్టీయే తెలంగాణలో ప్రజలకు ప్రత్యామ్నాయం అన్నారు. కాంగ్రెస్ పార్టీలో నాయకులకు వాళ్లలో వాళ్లకే అవగాహన లేదని, అందుకే, కాంగ్రెస్ ను ప్రజలు ఆదరించరని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ వాటాలు ఏమిటని బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనార్టీ వర్గాల ప్రజలు ఆలోచిస్తున్నారని, వీటన్నింటిపైన చర్చ జరుగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.

More Telugu News