: శివకాశీలోని బాణసంచా గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి మృతి
తమిళనాడు రాష్ట్రంలోని విరుధునగర్ శివకాశీలోని ఓ బాణసంచా గోడౌన్లో ఈ రోజు మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.