: నేడు చంద్రబాబు వైజాగ్ పర్యటన.. బిజీబిజీ!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు విశాఖపట్టణం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాలు పంచుకోనున్నారు. వాటి వివరాల్లోకి వెళ్తే...వంగలిలో కేంద్ర పెట్రోలియం యూనివర్సిటీకి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. వైజాగ్ లోని సీతమ్మధారలో 9 ఐటీ సంస్థల ప్రారంభోత్సవంలో పాలుపంచుకోనున్నారు. ఆంధ్రా యూనివర్సిటీలోని డిజిటల్‌ తరగతి గదులను ఆయన ప్రారంభిస్తారు. చివరగా జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, ప్రకాశ్ జవదేకర్‌, ధర్మేంద్ర ప్రధాన్‌ లతో కలిసి చంద్రబాబు పాల్గొంటారు.

More Telugu News