: నోబెల్ బహుమతి నాకు ఎందుకిచ్చారో తెలియదు: బరాక్ ఒబామా

2009లో నోబెల్ శాంతి బహుమతిని తనకు ఎందుకిచ్చారో ఇప్పటికీ తెలీదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా (55) అన్నారు. వచ్చే ఏడాది పదవీ కాలం పూర్తి కావడంతో శ్వేత సౌధాన్ని ఆయన వీడనున్నారు. ఈ నేపథ్యంలో ‘ద లేట్ షో’ అనే టీవీ షోలో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగానికి వచ్చిన ఒక అభ్యర్థిని ఇంటర్వ్యూ చేసే రీతిలో ఈ కార్యక్రమం సాగింది. దీంతో ఇంటర్వ్యూయర్ ఒబమాను మీకు నోబెల్ శాంతి పురస్కారం ఎందుకిచ్చారు? అని ప్రశ్నించారు. దానికి సమాధానం తనకు తెలియదని ఒబామా పేర్కొన్నారు. కాగా, ఒబామా 2008లో అమెరికా అధ్యక్షుడు కాగా, 2009లో ఆయనను నోబెల్ శాంతిపురస్కారం వరించింది.

More Telugu News