: చంద్రబాబు అధికారంలో ఉండేది మరో రెండేళ్లే: జగన్

చంద్రబాబు అధికారంలో ఉండేది మరో రెండేళ్లేనని వైఎస్సార్సీపీ అధినేత జగన్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా బేతపూడిలో ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ బాధితులతో ముఖాముఖి అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే తమ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని అన్నారు. చంద్రబాబుకి, ఆక్వా ఫుడ్ ప్రాజెక్ట్ యాజమాన్యానికి తాము చెప్పేది ఒకటేనని, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ముందుకు వెళితే బంగాళాఖాతంలోకి వెళ్లాల్సి వస్తుందని జగన్ హెచ్చరించారు.

More Telugu News