: చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు: వైఎస్సార్సీపీ నేత కాకాని

ఏపీ సీఎం చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఏపీ అసెంబ్లీని టీడీపీ కార్యాలయంగా మార్చేశారని మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కోసం పోరాడితే నోటీసులిస్తారా? అని ప్రశ్నించారు. లక్షల కోట్ల ఆస్తులున్న చంద్రబాబు కేవలం రూ.80 కోట్లు మాత్రమే ప్రకటించడం విడ్డూరంగా ఉందని అన్నారు.

More Telugu News