: ‘మెగా ఆక్వాఫుడ్ పార్క్‌ మాకు కావాలి’... పశ్చిమ గోదావ‌రిలో జ‌గ‌న్‌కు నిర‌స‌న సెగ

మెగా ఆక్వాఫుడ్ పార్క్ బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి ఆ ప్రాంతానికి వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి ఏలూరులో రైతుల నుంచి నిర‌స‌న సెగ త‌గిలింది. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ను నిర‌సిస్తూ ఆ ప్రాంత రైతులు ర్యాలీ తీశారు. 'మెగా ఆక్వాఫుడ్ పార్క్ మాకు కావాలి' అంటూ ప్లకార్డులు ప్ర‌ద‌ర్శించారు. జ‌గ‌న్ అందుకు అడ్డుత‌గ‌లకూడ‌దంటూ నినాదాలు చేశారు. నిర‌స‌న తెలుపుతున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్క‌డే కూర్చొని రైతులు త‌మ నిర‌స‌న‌ను కొన‌సాగించారు.

More Telugu News