: ఆసీస్ కు ఆ సిరీస్ చాలాకాలం గుర్తుండిపోయే చేదు జ్ఞాపకం: దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్
ఇటీవల ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్తో తమ జట్టు ఆడిన ఐదు వన్డేల సిరీస్లో తాము తమ ప్రత్యర్థి జట్టుకి మరచిపోలేని స్ట్రోక్ ఇచ్చామని దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్ వ్యాఖ్యానించాడు. ఆ సిరీస్ను ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ ఎంతో కాలం చేదు జ్ఞాపకంగా గుర్తుంచుకుంటుందని చెప్పాడు. తమ చేతిలో ఓటమితో ఆస్ట్రేలియా జట్టు మానసికంగా బలహీనపడుతుందనడంలో అతిశయోక్తి లేదని వ్యాఖ్యానించాడు. తమతో టెస్టు సిరీస్కు ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ ఇక డిఫరెంట్ జట్టుతో వస్తుందని డు ప్లెసిస్ జోస్యం చెప్పాడు. టెస్టు సిరీస్ ను విజయంతో మొదలుపెట్టాలంటే మంచి జట్టు అనేది ముఖ్యమైన విషయం అని ఆయన చెప్పాడు. తమతో జరిగిన వన్డే సిరీస్ మాత్రం ఆస్ట్రేలియాకు మరచిపోలేని అనుభవమేనని అన్నాడు. ఆసిస్కి తమ చేతిలో తగిలింది చిన్న దెబ్బేంకాదని అన్నాడు.