: కేసీఆర్ ఆదేశిస్తే రాజీనామా చేస్తా: ఎమ్మెల్యే పువ్వాడ

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని టీఆర్ఎస్ ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ తెలిపారు. పువ్వాడ ఆక్రమించుకున్న సరస్సులోని భూమిని ప్రభుత్వం క్రమబద్ధీకరించిందని ఆరోపిస్తూ సుధాకర్ రావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు... మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు, సదరు స్థలంలో చేపట్టిన నిర్మాణాలను తక్షణమే ఆపేయాలని పువ్వాడకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ, రాజకీయంగా తనను ఎదుర్కోలేకే, కొంతమంది రాద్ధాంతం చేస్తున్నారని తెలిపారు. రూ. 2.10 కోట్లు చెల్లించి జీవో 59 ప్రకారం కాలేజీ పక్కనున్న స్థలాన్ని క్రమబద్ధీకరించుకున్నామని తెలిపారు. తమ కాలేజీ ఆవరణలో ఎలాంటి సరస్సులు లేవని చెప్పారు.

More Telugu News