: ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం కడియం చర్చలు సఫలం.. రూ.600 కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ ప్ర‌భుత్వం విద్యార్థుల‌ ఫీజు రీయింబర్స్ మెంట్ ను విడుద‌ల చేయ‌క‌పోవ‌డంపై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోన్న ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో ఈ రోజు హైదరాబాద్‌లో తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి కడియం శ్రీహరి చేసిన‌ చర్చలు సఫలమ‌య్యాయి. రీయింబ‌ర్స్‌మెంట్ కోసం నిధులు విడుద‌ల చేస్తామని క‌డియం శ్రీ‌హ‌రి చెప్పారు. ఇందుకోసం మొదటి దశలో ప్ర‌భుత్వం రూ.600 కోట్లు విడుదల చేస్తుంద‌ని అన్నారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో విద్యార్థులు, ప్రైవేటు కళాశాల యాజమాన్యాలకు కొంత ఉపశమనం క‌లిగింది.

More Telugu News