: గుమ్మడి కాయ కొట్టి కాళ్లు కడగలేదు, పైగా యమగండంలో సచివాలయ ప్రవేశం చేశారు!: చంద్రబాబుపై చెవిరెడ్డి విమర్శలు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సచివాలయ ప్రవేశాన్ని యమగండం సమయంలో చేశారని, ఆ రోజు ఉదయం 7.30 నుంచి 9.00 గంటల వరకూ యమగండం ఉంటే, ఉదయం 8.09 నిమిషాలకు ఆయన శుభముహూర్తాన్ని ఎలా నిర్ణయించుకున్నారని వైకాపా నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన, ఇంటి యజమాని గుమ్మడికాయ కొట్టి, కాళ్లు కడుక్కున్న తరువాతే గృహప్రవేశం చేయాలన్న విషయం కూడా ఆయనకు తెలియకపోయిందని ఎద్దేవా చేశారు. దిష్టి గుమ్మడికాయ కొట్టి అలాగే లోనికెళ్లిపోయారని విమర్శించారు. రక్త సంబంధీకులు మరణిస్తే, మైల ఉంటుందని, దాన్ని కూడా చంద్రబాబు పాటించలేదని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు.