: మరోసారి సరిహద్దుల్లో పాక్ కాల్పుల ఉల్లంఘన

పాకిస్థాన్ తాజాగా మరోసారి సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ము కశ్మీర్‌ రాష్ట్రంలోని రాజౌరి జిల్లాలో భారత సైనిక శిబిరాలపై పాక్‌ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. అయితే వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు దీటుగా స్పందించాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని భారత రక్షణశాఖ ప్రతినిధి వెల్లడించారు. ఇటీవల పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News