: ఎన్టీఆర్ మీద పుస్తకం రాస్తున్నాను: దాడి
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్ పై పుస్తకం రాస్తున్నానని ప్రముఖ రాజకీయ నాయకుడు దాడి వీరభద్రరావు తెలిపారు. ఓ టీవీ చానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ చరిత్రపై సరైన పుస్తకం లేదని అన్నారు. ఆయన గురించిన చాలా విషయాలు ఎవరికీ తెలియవని ఆయన పేర్కొన్నారు. ఆయన అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ, తెలుగు ఇంగ్లీషు భాషల్లో ఒక పుస్తకం రాస్తున్నానని ఆయన తెలిపారు. దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన ఎన్టీఆర్ గురించి సవివరంగా చెప్పాలన్న ఉధ్దేశంతో ఈ పుస్తకాన్ని రాస్తున్నానని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ కు సంబంధించిన అన్ని విషయాలు అందులో ప్రస్తావిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఆయనకు సంబంధించిన చాలా విషయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. తన పుస్తకం అన్ని విషయాలను వివరిస్తుందని ఆయన అన్నారు.